Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వందే భారత్ ప్రాజెక్టు కింద 400 కొత్త రైళ్లు : నిర్మలా సీతారామన్

Advertiesment
Budget 2022 LIVE Updates
, మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (11:26 IST)
వందే భారత్ ప్రాజెక్టు కింద వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 400 రైళ్లను ప్రవేశపెడతామని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆమె 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగంలోకి కీలకాంశాలను పరిశీలిస్తే, 
 
యువత వ్యాపారాలు ప్రారంభించడానికి బడ్జెట్‌పై దృష్టి పెట్టాం.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రోడ్డు నిర్మాణ సౌకర్యాలు 22,000 కి.మీలకు విస్తరిస్తాం. 
వందే భారత్ ప్రాజెక్టు కింద మూడేళ్లలో 400 రైళ్లను ప్రవేశపెడతాం. 
ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో అభివృద్ధి ప్రాజెక్టుల అమలుకు దృష్టి సారిస్తాం. 
సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం. 
2022-02-01 భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. 
 
పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి 9.2 శాతంగా ఉంటుందని అంచనా. 
రాబోయే 25 ఏళ్ల వృద్ధికి పునాది వేసేందుకు ఈ బడ్జెట్‌ను తయారు చేశాం. 
కరోనా మహమ్మారి తర్వాత వేగంగా కోలుకుంటున్న ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో భారతదేశం ఒకటి. 
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటిగా ఆమె అభివర్ణించారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాదులో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయ్: ఐఎండీహెచ్