Publish Date: Wed, 26 Feb 2020 (08:15 IST)
Updated Date: Wed, 26 Feb 2020 (08:16 IST)
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్రంప్ కు పరిచయం చేశారు. ట్రంప్ దంపతులతో కేసీఆర్ కరచాలనం చేసి ఆత్మీయంగా పలకరించారు. అనంతరం ట్రంప్ సీఎం కేసీఆర్ తో ముచ్చటించారు.
రాష్ట్రపతి దంపతులు ఇచ్చిన ఈ విందు కార్యక్రమంలో ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, జైశంకర్, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తదితరులు పాల్గొన్నారు.
ట్రంప్ గౌరవార్ధం భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఏర్పటు చేసిన విందు మొనూలో ఆరెంజ్తో తయారు చేసిన అమ్యూజ్ బౌజ్, సాలమన్ ఫిష్ టిక్కా రకారకాల సూపులు ఆలూ టిక్కీ, స్పినాచ్ చాట్ తదితర వంటకాలను మెనూలో చేర్చారు.