మెుటిమలను తొలగించటానికి వేపాకులు తీసుకుంటే?
వేసవిలో ఎక్కువగా ఉండటం వలన మెుటిమలు, మచ్చలు తయారవుతుంటాయి. అందుకు ముఖ్య కారణం మీరు రకరకాల నూనెలు వాడటమే. కాబట్టి అటువంటి వారికి మెుటిమలు తొలగిపోవాలంటే ఈ చిట్కాలను తెలుసుకుంటే మంచిది.
Publish Date: Thu, 07 Jun 2018 (12:47 IST)
Updated Date: Thu, 07 Jun 2018 (13:50 IST)
వేసవిలో ఎక్కువగా ఉండటం వలన మెుటిమలు, మచ్చలు తయారవుతుంటాయి. అందుకు ముఖ్య కారణం మీరు రకరకాల నూనెలు వాడటమే. కాబట్టి అటువంటి వారికి మెుటిమలు తొలగిపోవాలంటే ఈ చిట్కాలను తెలుసుకుంటే మంచిది.
గిన్నెలో కొంచెం వేడినీళ్లు తీసుకుని అందులో 4 లేదా 5 వేపాకులను వేసి ముఖానికి ఆవిరి పట్టించాలి. మీరు ఆవిరి పట్టిన వేపనీరు చల్లారిన తరువాత ఆ నీటితోనే ముఖం కడుక్కుంటే మెుటిమలు మాయమవుతాయి. సున్నెపిండిలో నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత కడుక్కోవాలి. ఇలా చేసినట్లైతే మీ ముఖం అందంగా కాంతివంతంగా కనిపిస్తుంది.
ప్రతిరోజు ముఖానికి చిక్కుడు ఆకుల రసం రాసుకుని 5 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే మచ్చలు, మెుటిమల నుంటి త్వరగా ఉపశమనం పొందవచ్చును. కొన్ని బీర ఆకులను తీసుకుని అందులో కాస్త పసుపు, నిమ్మరసం కలిపి మెత్తగా నూరి ముఖానికి రాసుకుని 30 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేయడం వలన మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోతాయి.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More