Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతీయుల్లో 18 కోట్లమందిని కరోనావైరస్ ఏమీ చేయలేదు... ఎందుకంటే?

Advertiesment
coronavirus
, మంగళవారం, 21 జులై 2020 (20:42 IST)
మన దేశంలో 18 కోట్ల మంది భారతీయులు ఇప్పటికే కోవిడ్ రోగనిరోధక శక్తిని కలిగి ఉండవచ్చని థైరోకేర్ డేటా వెల్లడించింది. దేశంలో దాదాపు 15 శాతం మంది కరోనావైరస్ వ్యతిరేకంగా తమ శరీరంలో యాంటీబాడీస్ కలిగి వుండవచ్చని తమ డేటా సూచిస్తుందని తెలియజేసింది.
 
థైరోకేర్ యొక్క అంచనా ఏమిటంటే, దేశంలో దాదాపు 15 శాతం మందికి ఇప్పటికే కరోనావైరస్ వ్యతిరేకంగా యాంటీబాడీస్ ఉండవచ్చు. ఒక ప్రైవేట్ ల్యాబ్ దేశవ్యాప్తంగా 20 రోజులలో నిర్వహించిన యాంటీబాడీ పరీక్షల డేటాను బహిరంగపరిచింది. ఫలితాలు అద్భుతంగా వచ్చినట్లు తెలిపింది. దేశంలో 18 కోట్ల మందిలో కరోనావైరస్ వ్యతిరేకంగా ఇమ్యూనిటి పవర్ వున్నట్లు డేటా సూచిస్తుంది.
 
20 బేసి రోజులలో 600 పిన్ కోడ్‌లలో నిర్వహించిన 60,000 యాంటీబాడీ పరీక్షల నుండి థైరోకేర్ తన డేటాను తీసుకుంది. వారి అంచనా ఏమిటంటే, దేశంలో దాదాపు 15 శాతం మందికి ఇప్పటికే కరోనావైరస్‌ను అడ్డుకోగల శక్తిని కలిగి వున్నారన్నది. ఈ ఫలితం 3 శాతం ప్లస్ లేదా మైనస్‌గా వుండవచ్చు.
 
ఐతే ఇది యాదృచ్ఛిక అధ్యయనం లేదా అధికారిక సర్వే కాదు, అయితే దీని నుండి వచ్చిన డేటా జూన్ ప్రారంభంలో నిర్వహించిన భారత అత్యున్నత పరిశోధనా సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) నిర్వహించిన రెండవ సెరోప్రెవలెన్స్ అధ్యయనంలో స్పష్టంగా ఉంది. ఐసిఎంఆర్ ఆ డేటాను ఇంకా బహిరంగపరచలేదు. కనుక దీన్ని ధృవీకరించాల్సి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభుత్వ సహకార డెయిరీలకు మంచి రోజులు: జగన్‌