ఐపీఎల్ 2025లో మిగిలిన 17 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ విడుదలకానుంది. మే 17 నుంచి మ్యాచ్లు తిరిగి ప్రారంభంకానున్నాయి. మొత్తం ఆరు వేదికల్లో మ్యాచ్లు నిర్వహించేలా ఏర్పాటుచేశాయి. బెంగుళూరు, జైపూర్, ఢిల్లీ, ముంబై, లక్నో, అహ్మదాబాద్ వేదికలుగా ఖరారు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన అనంతరం బీసీసీఐ షెడ్యూల్ ఖరారు చేసింది.
మే 29వ తేదీ నుంచి క్వాలిఫయర్ 1, 30న ఎలిమినేటర్, జూన్ 1వ తేదీన క్వాలిఫయర్ 2, జూన్ 3వ తేదీన ఫైనల్ నిర్వహించనున్నారు. అయితే, ప్లే ఆఫ్స్ మ్యాచ్ల వేదికలు ఇంకా ఖరారు చేయలేదు. రెండు ఆదివారాలు డబుల్ హెడ్డర్లు మ్యాచ్లు ఉంటాయి. పంజాబ్ - ఢిల్లీ మ్యాచ్ మధ్యలోనే ఆగిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ను కూడా నిర్వహించనుంది. అయితే, మళ్లీ మొదటి నుంచి నిర్వహిస్తారా? లేకపోతే అప్పటికే ఒక ఇన్నింగ్స్ కొనసాగుతోంది. దానిని అలాగే, కొనసాగిస్తారా? అనేది స్పష్టం చేయలేదు. లీగ్ స్టేజ్లో 13, ప్లేఆఫ్స్లో 3, ఫైనల్ జరగనున్నాయి.