Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళల టీ20 ప్రపంచకప్‌.. అరుదైన రికార్డు..

Advertiesment
Women world cup
మహిళల టీ20 ప్రపంచకప్‌లో అరుదైన రికార్డు నమోదైంది. ఎంసీజీ మైదానంలో జరిగిన టైటిల్ పోరును 86,174 మంది ప్రత్యక్షంగా చూశారు. ఇదీ ఒక రికార్డే. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ చిత్తుగా ఓడిపోయింది. 85 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించిన ఆసీస్‌ ఐదోసారి విశ్వవిజేతగా నిలిచింది.
 
ఇంకా ఆస్ట్రేలియా వేదికగా ఈ నెల తొలివారంలో ముగిసిన ఈ మహిళల టీ20 క్రికెట్‌ను చరిత్రలోనే అత్యధిక మంది వీక్షించిన టోర్నీగా నిలిచింది. ఈ మెగా ఈవెంట్‌ను ప్రపంచ వ్యాప్తంగా 74.9 మిలియన్ల మంది వీక్షించారు. 2018 మహిళల టీ20 వరల్డ్‌కప్‌ కంటే ఇది రెట్టింపు కావడం గమనార్హం. ఆ టోర్నీని 36.9 మంది ప్రేక్షకులు చూశారు.
 
తాజా ప్రపంచ కప్‌ను 5.4 బిలియన్ నిమిషాలు వీక్షించారు. 2018 టోర్నీని 1.8 బిలియన్ నిమిషాల కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. ముఖ్యంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను అయితే 9.9 మిలియన్ల మంది వీక్షకులతో కొత్త రికార్డు సృష్టించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబ్బు - మతం కంటే మనిషిగా ఉందాం... సాయం చేసుకుందాం : షోయబ్ అక్తర్