Publish Date: Mon, 29 Apr 2024 (13:02 IST)
Updated Date: Mon, 29 Apr 2024 (13:06 IST)
శ్రీరెడ్డి ఇలా రెచ్చిపోవడానికి ప్రముఖ జర్నలిస్ట్ టీవీ5 మూర్తే కారణమని ఆరోపణలు వచ్చాయి. ఈ వార్తలపై మూర్తి వివరణ ఇచ్చారు. శ్రీరెడ్డిని లైవ్ షోకు పిలిచానని, ఈ సందర్భంగా ఏం జరిగిందో చెప్పడంతో పాటు వాళ్ల సంగతి తేలుస్తానంటూ ఆమె ఊగిపోయిందన్నారు. దీంతో తాను, మరో సినీనటి కరాటే కళ్యాణీ ఆమెను మందలించామని మూర్తి గుర్తుచేశారు.
శ్రీరెడ్డి ఫిలిం ఛాంబర్ ముందు నిరసన ప్రదర్శన చేసిన రోజున తాను హైదరాబాద్లోనే లేనని, తన తల్లికి అనారోగ్యంగా వుంటే ఆసుపత్రిలో ఆమె పక్కనే వున్నానని స్పష్టం చేశారు.
సొంతూరి నుంచి హైదరాబాద్కు వచ్చిన తర్వాత శ్రీరెడ్డి ఇష్యూ గురించి తెలిసిందని, ఈ గొడవకు తానే కారణమంటూ కొందరు ఆరోపణలు చేశానని ఆయన వెల్లడించారు. అయితే శ్రీరెడ్డి చెప్పిన క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమానికే తాను మద్ధతుగా నిలిచానని, అంతే తప్పించి ఆమె చేసిన నిరసనకు కాదని మూర్తి తేల్చిచెప్పారు.