Publish Date: Fri, 01 Feb 2019 (15:17 IST)
Updated Date: Fri, 01 Feb 2019 (17:00 IST)
క్షయవ్యాధిని అంటువ్యాధి అని పిలుస్తారు. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. చర్మం నుండి మెదడు వరకు శరీరంలో ఏ భాగానికైనా ఈ వ్యాధి రావొచ్చు. మన దేశంలో దీర్ఘకాలిక వ్యాధులలో క్షయవ్యాధి ఒకటి. మైకోబ్యాక్టీరియా అనే సూక్ష్మక్రిముల కారణంగానే ఈ వ్యాధి వస్తుంది. క్షయ వ్యాధి సోకిన శరీర అవయవాలు క్లోమం, థైరాయిడ్ వంటి రోగాలతో బాధపడవలసి వస్తుంది.
1. క్షయ వ్యాధి సోకినట్లైతే గొంతు కండలు ఏర్పడడం, కొద్ది నెలల తేడాలో ఆకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, రాత్రి పూట స్వల్ప స్థాయిలో జ్వరం రావడం, జ్వరం వచ్చినప్పుడు బాగా చెమట పట్టడం, నెలల తరబడి తగ్గని దగ్గు వంటివి ముఖ్యమైన రోగలక్షణాలు.
2. ఈ వ్యాధిని పూర్తిస్థాయిలో గుర్తించడం కష్టం. రెండు వారాలకు పైగా దగ్గు ఉన్నట్లైతే.. క్షయవ్యాధి సోకినట్టు సందేహించవచ్చు. దీనికి తోడుగా సాయంత్రం పూటల్లో జ్వరం, ఆకలి లేకపోవడం, గుండె నొప్పి, జలుబు వంటి సూచనలు కనిపిస్తాయి.
3. క్షయవ్యాధి ఊపిరితిత్తులకే కాకుండా అప్పడప్పుడు ఎముకలు, కీళ్లు, చర్మం వంటి వాటికి కూడా రావొచ్చు. ఇది పెద్దలలో కన్నా చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంటుంది. ఎముక దగ్గర వాపు, స్వల్ప జ్వరం ఉంటాయి.