Publish Date: Mon, 11 Feb 2019 (20:19 IST)
Updated Date: Mon, 11 Feb 2019 (20:20 IST)
ఖర్జూరాలు మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఇవి ఆరోగ్యానికి పలు రకాలుగా మేలు చేస్తాయి. ఖర్జూరాలలో కొలస్ట్రాల్ ఉండదు. ఖర్జూరాలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. ఇందులో అనేక రకములైన పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్-ఎ, బిలతో పాటు ఐరన్, పాస్పరస్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. వీటిని పాలతో కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
1. అత్యంత తియ్యగా ఉండే ఈ ఖర్జూరంలో గ్లూకోజ్, ప్రక్టోజ్లు అధికంగా ఉంటాయి. ఖర్జూరం రోజూ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉండి, గుండెకు సంబందించిన వ్యాదులను దూరంగా ఉంచుతుంది. గుండెకు బలాన్ని చేకూరుస్తుంది.
2. ఇందులో యాంటీఆక్సీడెంట్ల రూపంలో ఉండే విటమిన్-సి కంటికి చాలా మంచిది. దీనిని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కంటికి సంబంధించిన సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.
3. ఖర్జూరాలు ఆరోగ్యకరమైన బరువు పెంచడానికి సహాయపడుతుంది. బాగా సన్నగా ఉన్నవారు రోజూ ఖర్జూరాన్ని తినడం వల్ల సహజంగా బరువు పెరుగుతారు. కాబట్టి బరువు తగ్గాలని అనుకునేవారు రోజువారి ఆహారంలో ఖర్జూరాన్ని చేర్చుకోవడం మంచిది.
4. కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను కరిగించే శక్తి ఖర్జూరాలకు ఉంది. అంతేకాకుండా మూత్ర సంబంధిత సమస్యలను, ఇన్పెక్షన్లని దూరం చేస్తుంది. రాత్రిపూట నీటిలో నాలుగు ఖర్జూరాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల మలబద్దకాన్ని తగ్గించుకోవచ్చు. ఖర్జూరంలో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
5. ఎముకల దృఢత్వానికి బాగా ఉపకరిస్తాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, కాపర్ సమృద్దిగా ఉన్నాయి. దంతాలను దృఢపరచడంలో ఇవి కీలకపాత్ర వహిస్తాయి. అంతేకాకుండా జలుబు, గొంతులో శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఇందులో ఉండే ఔషద గుణాలు పెద్ద ప్రేగులోని సమస్యలను నివారిస్తాయి.
సిహెచ్
Publish Date: Mon, 11 Feb 2019 (20:19 IST)
Updated Date: Mon, 11 Feb 2019 (20:20 IST)