Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
బొజ్జను తగ్గించాలంటే.. పాదహస్తాసనంను వేయడం ఉత్తమ మార్గం. ఈ ఆసనం ద్వారా పొట్టతగ్గడంతో పాటు మధుమేహం కూడా నియంత్రణలో వుంటుంది. బొజ్జను తగ్గించి మధుమేహాన్ని దూరం చేసే ఈ ఆసనాన్ని రోజు పది నుంచి పదిహేను నిమిషాలు పాటించాలి.
తూర్పు వైపున నిల్చుని.. రెండు కాళ్లను చేర్చుకోవాలి. రెండు చేతులను తలపైకి లేపి.. శ్వాసను బయటకు వదులుతూనే కిందకు వంగి.. కాలి బొటన వేలును తాకాలి. ఇలా 20 నిమిషాలు శ్వాసను వదులుతూ ఆసనం వేయాలి. తర్వాత మెల్లగా నిల్చుని సాధారణ స్థాయికి రావాలి. ఇలా మూడుసార్లు చేస్తే బానపొట్ట తగ్గిపోతుంది.
ఎవరు చేయకూడదు...?
ఈ ఆసనాన్ని.. వెన్నునొప్పి అధికంగా వున్నవారు చేయకూడదు. వెన్నెముక చికిత్స తీసుకుంటున్నవారు చేయకూడదు. వెన్నులో ఏదైనా శస్త్రచికిత్స చేసిన వారు ఈ ఆసనాన్ని పాటించకూడదు. మధుమేహం వున్నవారు నెమ్మదిగా ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయాలి. తొలి రోజే ఈ ఆసనాన్ని పూర్తిగా చేయలేం. కొద్ది నెలల వరకు ప్రాక్టీస్ చేస్తేనే సాధ్యం. కానీ వంగి కాలి బొటన వేలును తాకేందుకు ప్రయత్నించాలి.