Publish Date: Fri, 24 Jul 2020 (18:57 IST)
Updated Date: Fri, 24 Jul 2020 (19:02 IST)
"అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిమ్ వద
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో" అనే శ్లోకాన్ని శనివారం పూట పఠిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే శనివారం ఉదయం నిష్ఠతో సుందరకాండ పారాయణం చేయడం.. శ్రీ వేంకటేశ్వర స్వామిని స్తుతించడం ద్వారా శనిదోషాలు తొలగిపోతాయి. రాహు దోషాలు పటాపంచలు అవుతాయి.
అలాగే శనివారం పూట శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద నేతితో దీపమెలిగించే వారికి సకలసంపదలు చేకూరుతాయి. ఇంకా ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున హనుమంతునిని ప్రార్థిస్తే.. ఈతిబాధలు వుండవని పండితులు అంటున్నారు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడిని సింధూరంతో అర్చించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి.
ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున నిష్టతో ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం. అందుచేత అమావాస్య సాయంత్రం పూట మహిళలు, పురుషులు ఆంజనేయ స్వామికి నేతితో దీపమెలిగించి.. హనుమంతుడి ఆలయాన్ని 18 సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా మనోధైర్యం, సకలసంపదలు, ఉన్నత పదవులు లభిస్తాయని పండితులు అంటున్నారు.