Publish Date: Sat, 11 Jul 2026 (10:59 IST)
Updated Date: Sat, 11 Jul 2026 (13:59 IST)
తిరుమల అలిపిరి నడక మార్గంలో శుక్రవారం నాడు చిరుతపులి కనిపించడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సమీపంలో చిరుత కనిపించడంతో భక్తులు భయపడిపోయారు. ఆలయం దగ్గర చిరుతపులిని గమనించిన భక్తులు వెంటనే పెద్దగా కేకలు వేశారు.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని, ఇనుప కడ్డీలతో పెద్ద శబ్దాలు చేస్తూ ఆ చిరుతపులిని తిరిగి అడవిలోకి పంపించివేశారు. భక్తులు భద్రత దృష్ట్యా నడక మార్గంలో ఒంటరిగా వెళ్లవద్దని, గుంపులుగా ప్రయాణించాలని అధికారులు సూచించారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia....
Read More