Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేసిన తితిదే

Advertiesment
Tirumala
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బుధవారం రిలీజ్ చేసింది. ఈ నెల 17 నుంచి 20 వరకు సంబంధించిన కోటా దర్శన టికెట్లు విడుదల చేసింది. 
 
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను తితిదే విడుదల చేసింది. ఈ నెల 17 నుంచి 20 వరకు సంబంధించిన టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ నెల 17 నుంచి నాలుగు రోజల పాటు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. 
 
ఈ రోజులకు సంబంధించి ప్రత్యేక టికెట్లను విడుదల చేశారు. టికెట్లను విడుదల చేసిన కొంత సమయానికే చాలా వరకు అమ్ముడుపోయాయి. అధికసంఖ్యలో భక్తులు టికెట్లు బుక్​ చేసుకునేందుకు ఆసక్తి కనబర్చడంతో వెబ్‌సైట్‌ స్తంభించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కామిక ఏకాదశి 2021: మహావిష్ణువును తులసీ ఆకులతో పూజిస్తే..?