Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా సినీ నటి ఆర్కే. రోజా వైకాపా తరపున ఎంపికయ్యారు. ఈమె మంత్రి పదవిపై గంపెడాశాలు పెట్టుకున్నారు. కానీ, ముఖ్యమంత్రి జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకోలేదు. కానీ, ఆమెను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల పెట్టుబడుల సంస్థ (ఏపీఐఐసీ)కు ఛైర్పర్సన్గా నియమించారు. ఇందుకోసం ఆమెకు నెలకు వేతంగా రూ.3.82 లక్షలుగా చెల్లించనున్నారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఈ మొత్తంలో
రూ.2 లక్షలు జీతంగా నిర్ణయించిన ప్రభుత్వం.. వాహన సౌకర్యానికి 60 వేలు, అధికార క్వార్టర్స్లో నివాసం లేని యెడల వసతి సౌకర్యానికి 50 వేలు, మొబైల్ ఫోన్ చార్జీలకు 2 వేలు, వ్యక్తిగత సిబ్బంది జీత భత్యాలు చెల్లించేందుకు 70 వేల రూపాయలు చొప్పున కేటాయించింది.