Publish Date: Sat, 29 May 2021 (14:23 IST)
Updated Date: Sat, 29 May 2021 (14:26 IST)
నల్లగా ఉండే ఉల్లిగడ్డల ద్వారా బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశముందని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఎయిమ్స్ చీఫ్ ప్రొఫెసర్. డాక్టర్.రణ్ దీప్ గులేరియా ఖండించారు.
అలాగే ఫ్రిడ్జ్ లో నల్లగా పేరుకుపోయిన బ్యాక్టీరియా కూడా బ్లాక్ ఫంగస్ కు కారణమౌతుందనేది అవాస్తవమన్నారు. కూరగాయలు, వస్తువుల ద్వారా బ్లాక్ ఫంగస్ రాదని స్పష్టం చేశారు. ఉల్లిపై కనిపించే నల్లని పొర భూమిలో ఉండే ఫంగస్ వల్ల వస్తుందని తెలిపారు.