Publish Date: Wed, 05 Nov 2025 (15:56 IST)
Updated Date: Wed, 05 Nov 2025 (16:01 IST)
తిరుమల దేవస్థానానికి వెళ్లే రెండో ఘాట్లో ఓ పెద్ద కొండ చిలువ కలకలం రేపింది. తరచూ ఘాట్ రోడ్డులలో చిరుత పులులు, ఇతన వన్య మృగాలు, సరీ సృపాలు దర్శనమిస్తుంటాయి. తాజాగా రాత్రి వేళ రోడ్డు దాటుతున్న కొండ చిలువను భక్తులు గమనించారు.
వినాయక స్వామి ఆలయం దాటుకొని కారులో వెళ్తున్న కొందరు భక్తులు కొండచిలువను చూసి దానిని తమ ఫోన్లో వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.