Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫోనుకు మూడు ముళ్లు వేసిన వరుడు ... ట్రెండ్ సెట్ చేసిన యూత్.. ఎక్కడ?

Advertiesment
Kerala
, బుధవారం, 29 ఏప్రియల్ 2020 (08:05 IST)
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు దేశం యావత్తూ లాక్‌డౌన్‌లో ఉంది. ఫలితంగా ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. పైగా, ఈ లాక్‌డౌన్ కారణంగా ముందుగా కుదర్చుకున్న అనేక శుభకార్యాలను కూడా వాయిదా వేసుకుంటున్నారు. కానీ, కొంతమంది కోటీశ్వరులు, రాజకీయ నేతలు మాత్రం అనుకున్న సమయానికి అతికొద్ది మంది అతిథుల సమక్షంలో పెళ్లిళ్లు కానిచ్చేస్తున్నారు. 
 
తాజాగా కేరళకు చెందిన ఓ యువకుడు.. ముందుగా పెట్టుకున్న ముహుర్తానికే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతనికి వచ్చిన ఐడియాను వధువు కుటుంబ సభ్యులకు చేరవేశాడు. వారు కూడా అందుకు సమ్మతించడంతో వీడియో కాల్‌ ద్వారా పెళ్లి చేసుకున్నాడు. కానీ, వధువు మెడలో వేయాల్సిన మూడు ముళ్లు మాత్రం మొబైల్ ఫోనుకు కట్టాడు.
Kerala
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళ రాష్ట్రంలోని కొట్టాయంకు సమీపంలో ఉన్న చెంగనాషేరి ప్రాంతానికి చెందిన శ్రీజిత్ నటేషన్ (30) అనే యువకుడికి పల్లిపడ్ ప్రాంతానికి చెందిన పి.అంజన (28)కు వివాహం చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. కానీ, లాక్‌డౌన్ కారణంగా వారు అనుకున్న ప్లాన్స్ అన్నీ తిరగబడ్డాయి. దీనికి కారణం వధువు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటడంతో లాక్‌డౌన్ కారణంగా అక్కడే చిక్కుకునిపోయింది. 
 
అయితే, ముందుగా పెట్టుకున్న ముహుర్తానికే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో వీడియో కాల్ ద్వారా వారిద్దరి వివాహాన్ని పెద్దలు జరిపించేశారు. కానీ, మూడు ముళ్లు మాత్రం... వీడియో కాల్ వధులు కనిపిస్తుంటే... ఆమె మెడలో కట్టినట్టుగా ఫోనుకు వేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో 1594.. తెలంగాణాలో 6 కరోనా పాజిటివ్ కేసులు