Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వీపర్ పోస్టులకు పీజీ- బీటెక్ - ఎంటెక్ విద్యార్థుల పోటాపోటీ

Advertiesment
M.Tech
ఒకపుడు బీటెక్, ఎంటెక్ కోర్సులు పూర్తి చేస్తే ఖచ్చితంగా ఐటీ ఉద్యోగం ఖాయమని భావించేవారు. వీలైతే స్వదేశం లేదా విదేశాల్లోలోని పేరుమోసిన ఐటీ కంపెనీల్లో ఉద్యోగం వస్తుందని నమ్మేవారు. కానీ, ఇపుడు పరిస్థితి ఇపుడు తారుమారైంది. ఈ కోర్సులు పూర్తి చేసిన పట్టభద్రులు ఇపుడు నిరుద్యోగులుగా ఉన్నారు. పైగా, స్వీపర్ పోస్టులకు సైతం దరఖాస్తు చేసుకుంటున్నారు. 
 
తాజాగా తమిళనాడు రాష్ట్ర శాసనసభలో ఖాళీగా 14 శానిటరీ పోస్టుల కోసం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ పోస్టుల కోసం పదో తరగతి ఫెయిల్ అయిన నిరుద్యోగులతో పాటు.. బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులు సైతం దరఖాస్తు చేసుకున్నారు. 
 
అంతేనా, ఎంబీఏ, పీజీ, డిప్లొమోలు పూర్తి చేసిన వారు సైతం దరఖాస్తు చేసుకున్నారు. ఈ 14 పోస్టుల కోసం ఇప్పటికే 3900కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇది దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో నిరూపిస్తోంది. పైగా, స్వీపర్ పోస్టుకు ఎంపికయ్యే వారికి నెలకు రూ.17 వేలు వేతనం ఇవ్వనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్పైస్ జెట్‌ సరికొత్త ఆఫర్.. ఒక కిలోమీటర్‌కు రూ.1.75 పైసలు