Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ డైలాగుకి కేరాఫ్ అడ్రెస్గా మారిన పృథ్విరాజ్ చేపట్టిన ఎస్వీబీసి పదవి మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. ఆయన ఓ మహిళా ఉద్యోగినితో చేసిన సంభాషణ అంటూ పలు ఛానళ్లలో ప్రసారమైన ఆడియో రచ్చ చేసింది. చివరికి ఈ కారణంగా ఆయన పదవి వదులుకోవాల్సి వచ్చింది.
ఆ ఛానల్ కి చైర్మన్ పదవిని చేపట్టేటపుడు ప్రక్షాళన చేస్తానంటూ చెప్పారు పృథ్వి. కానీ అది ఎంతమేరకు చేశారో తెలియదు కానీ పదవి మాత్రం పోయింది. నిజానికి పృథ్వి ఎస్వీబీసి ఛానల్ చైర్మన్ పదవి చేపట్టగానే, ఆ పదవిని పృథ్వి చేపట్టకుండా వుండి వుంటే బాగుండేది అని ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి చెప్పారు.
ఇప్పుడు ఆయన మాటలే కరెక్ట్ అనిపిస్తున్నాయి. ఎందుకంటే అనవసరంగా పోస్టుని చేపట్టి మంచులో ముసుగు మనుషుల పిడిగుద్దులు, దెబ్బలు తినడంతో పాటు రాసలీలల ఆడియో టేపు పృథ్వి పరువును బజారున పడేశాయి. ప్చ్... పృథ్వి.