Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నరసాపురం ఎంపీ కృష్ణంరాజు రూ.1000 కిళ్లీ తినేందుకు మోదీ వస్తారా?

Advertiesment
Raghurama krishnamraju
నరసాపురం పార్లమెంట్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు భారతీయ జనతా పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆయన ఏర్పాటు చేస్తున్న విందు హీట్ పెంచుతుంది. ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో భారీ ఎత్తున ఓ పార్టీని ఇస్తున్నారు రఘురామ కృష్ణంరాజు. ఈ పార్టీకి దాదాపుగా మూడువేల మంది వీవీఐపిలు, వీఐపీలు హాజరవుతున్నారు.
 
ఈ విందులో ప్రధాని మోడీ, అమిత్ షాతో పాటు, భాజపా అగ్ర నేతలు వివిధ పార్టీల నేతలు, సినీ తారలు హాజరవుతున్నారు. దాదాపు 100 రకాల వంటకాలు విందులో రుచి చూపించబోతున్నాయి. గోదావరి రుచులు ఈ విందులో ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. భోజనాలు మాట పక్కన పెడితే 
ఈ విందులో మరో స్పెషల్ కిళ్ళీది.
 
ఈ కిళ్ళీ ఖరీదు రూ. 1000 అట. ఈ స్థాయిలో ఉన్న కిళ్ళీ ఎలా ఉండబోతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ రఘురామ కృష్ణంరాజు ఈ పార్టీ ఎందుకు ఇస్తున్నారు. వైసీపీ ఎంపీలు ఈ విందుకు వస్తారా అన్న విషయం క్లారిటీ లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో గాలిపీల్చి సగం చచ్చిపోయాం.. ఇక మమ్మల్ని చంపేదేముంది.. నిర్భయ దోషి