Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించండి... జేసీ దివాకర్ రెడ్డి.. అహ్హ హ్హ హ్హ హ్హా..

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (15:25 IST)
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కూడా పప్పులో కాలేశారు. టీడీపీ తరపున పోటీ చేస్తున్న తన కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డిని హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఓటర్లతో పాటు... ఆయన పక్కన ఉన్న నేతలంతా ఒక్కసారి ఖిన్నులయ్యారు. ఆ తర్వాత పక్కనవున్నవారు హస్తం గుర్తు కాదు.. సైకిల్ గుర్తు అని గుర్తు చేయడంతో అహ్హ హ్హ హ్హ హ్హా అంటూ నవ్వి సరిపెట్టుకున్నారు. 
 
తన ఎన్నికల ప్రచారంలో భాగంగా, అనంతపురం జిల్లా నారాయణపురంలో తన కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డికి అనుకూలంగా జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం ప్రచారం చేశారు. ఆ సమయంలో ఆయన ప్రచార రథంపై నుంచి ప్రసంగిస్తూ, తాను నిధులు మంజూరు చేయించగలిగానని, కానీ, అభివృద్ధి పనులు చేయలేక పోయినట్టు చెప్పారు. అయితే, తన కుమారుడుని గెలిపిస్తే మాత్రం నిధులతో పాటు పనులను కూడా పూర్తి చేయిస్తాడని, అందువల్ల హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. 
 
ప్రజలంతా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన తనకు ఆ పార్టీపై మమకారం ఇంకా చావలేదన్నారు. అందుకే తాను ఇలా మాట్లాడుతున్నానని తన మనసులోని మాటను చెప్పారు. హిందీ రాకపోవడం వల్ల ఎంపీగా ఫెయిల్‌ అయ్యానని అంగీకరించారు. తన కుటుంబం గద్వాల్‌ నుంచి వలస వచ్చిన మాట వాస్తవమేనని, తన స్థానికతను ప్రశ్నించొద్దని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments