Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యం.. మరో సందేహం వద్దు : ఆర్కే.రోజా

Webdunia
బుధవారం, 22 మే 2019 (12:14 IST)
నవ్యాంధ్ర రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆ పార్టీకి చెందిన సీనియర్ మహిళా నేత, నగరి వైకాపా అభ్యర్థి ఆర్కే. రోజా జోస్యం చెప్పారు. ఆమె బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 
 
ఆ తర్వాత ఆమె విలేకరులతో మాట్లడుతూ, మరి కొన్ని గంటల్లో వెల్లడికానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర ప్రజలు, వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు వల్ల రాష్ట్రం పరువు పోయిందని, అభివృద్ధిలో వెనుకబడిపోయామన్నారు. 
 
నగరి నియోజకవర్గం నుంచి తాను రెండోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని రోజా ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగడించిన లగడపాటి రాజగోపాల్‌ది స్వార్థపూరిత సర్వే అని, నిష్పక్షపాతంగా చేసింది కాదన్నారు. ఈ విషయం తమిళనాడు, తెలంగాణ ఎన్నికల ఫలితాలలో తేలిందన్నారు. 
 
లగడపాటి సర్వేను ప్రజల్లో ఒక్కరు కూడా నమ్మడం లేదన్నారు. త్వరలోనే వైఎస్‌ జగన్‌ సీఎం అవుతారని, మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెస్తారని ధీమా వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలను నమ్ముకున్న టీడీపీకి రేపటి ఫలితాలు సరైన గుణపాఠం చెబుతాయని చెప్పారు. ఐదేళ్లలో రాష్ట్ర మహిళలను అప్పులపాలు చేయడమే కాకుండా కోర్టు మెట్లు ఎక్కించారని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tarak: కళ్యాణ్ రామ్, ఎన్.టి.ఆర్. (తారక్) పేర్లు ప్రస్తావించిన పురందేశ్వరి

Rajasaheb: ప్రభాస్ రాజాసాబ్ కీలక అప్ డేట్ - కీసరలో రీషూట్స్ !

పోస్టర్ తో ఆసక్తికలిగించిన సుధీర్ బాబు హీరోగా చిత్రం

CULT: రచయిత, హీరోగా, దర్శకుడిగా విశ్వక్సేన్ చిత్రం కల్ట్ ప్రారంభం

భైరవం నుంచి నిజమైన ఫ్రెండ్షిప్ సెలబ్రేషన్ సాంగ్ తో రాబోతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments