Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్నాడు జిల్లా రెంటాలలో టీడీపీ ఏజెంట్లపై దాడి... ఈసీ సీరియస్

ఠాగూర్
సోమవారం, 13 మే 2024 (07:47 IST)
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఏజెంట్లపై వైకాపా వర్గీయులు భౌతికదాడులకు తెగబడ్డారు. సోమవారం ఉదయం 7 గంటలకే ఏపీలో పోలింగ్ ప్రారంభమైన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం ఆరు గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత ఉదయం ఏడు గంటల నుంచి అధికారులు ఓటింగ్ ప్రక్రియను ప్రారభించారు. 
 
ఈ పరిస్థితుల్లో పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంటాలలో ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన ఏజెంట్లపై అధికార వైకాపా వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారి స్థానంలో మరో ఇద్దరు ఏజెంట్లను అధికారులు అనుమతించారు. మాక్‌ పోలింగ్‌ పూర్తయిన తర్వాత.. రెగ్యులర్‌ పోలింగ్‌ ప్రారంభిస్తున్న క్రమంలో వైకాపా ఏజెంట్లు తెదేపా ఏజెంట్లపై దాడి చేశారు. 
 
మరోవైపు, ఈ దాడి ఘటనపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్‌ ప్రారంభానికి ముందే పల్నాడులో గొడవలపై కన్నెర్రజేసింది. తక్షణం పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. అవసరమైతే అదనపు బలగాలను తరలించి సమస్యాత్మక ప్రాంతాల్లో మొహరించేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments