Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ ఎన్‌కౌంటర్

తెలంగాణ రాష్ట్రంలో భారీఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ హతమయ్యాడు. ఈ ఎన్‌కౌంటర్ చత్తీస్‌గఢ్ - తెలంగాణ సరిహద్దులో జరిగింది.

Webdunia
శుక్రవారం, 2 మార్చి 2018 (11:57 IST)
తెలంగాణ రాష్ట్రంలో భారీఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ హతమయ్యాడు. ఈ ఎన్‌కౌంటర్ చత్తీస్‌గఢ్ - తెలంగాణ సరిహద్దులో జరిగింది. భూపాలపల్లి జిల్లా వెంకటాపురం సరిహద్దులోని తడపలగుట్ట, పూజారీ కాంకేడ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. 
 
తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో మొత్తం 12 మంది మావోయిస్టులు చనిపోయినట్టు సమాచారం. మృతుల్లో ఆరుగురు మహిళా మావోయిస్టులు ఉన్నట్టు తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేతలు హరిభూషణ్, ఖమ్మం జిల్లా కార్యదర్శి కొయ్యడ సాంబయ్య, అలియాస్ గోపన్న… సెంట్రల్ రెవల్యూషనరీ కమిటీ కార్యదర్శి సాగర్ మృతి చెందారు. 
 
ఈ ఎన్‌కౌంటర్‌లో గ్రౌహౌండ్స్ కానిస్టేబుల్ సుశీల్ కూడా చనిపోయాడు. వికారాబాద్‌కు చెందిన సుశీల్…. 2004 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌గా గుర్తించారు. మృతదేహాలను భద్రాచలం ఏరియా హాస్పిటల్‌కు తరలించారని సమాచారం. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా ఆయుధాలు, ఏకే 47 తుపాకులు, స్కానర్, ల్యాప్ టాప్‌తో పాటు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments