Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాళహస్తిలో మేకపిల్లను మింగిన కొండచిలువ.. చివరికి..?

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (17:41 IST)
పలు సందర్భాల్లో కొండ చిలువలు మనుషులను మింగేసిన ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఓ కొండ చిలవ మేక పిల్లను మింగిన ఘటన చోటుచేసుకుంది.

శ్రీ కాళహస్తీశ్వరాలయం సమీపంలోని భరద్వాజ తీర్ధంలో 13 అడుగుల కొండచిలువ ఓ మేకపిల్లను మింగేసింది. దీంతో కొండ చిలువ అటు ,ఇటు ముందుకు కదలలేని స్ధితిలో అక్కడే ఉండటంతో దీనిని ఆలయ సిబ్బంది గమనించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు.
 
హుటాహుటిన అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు కొండచిలువను పట్టుకుని మింగిన మేకపిల్లను కక్కించారు. మేక పిల్లను బయటకు తీసేందుకు కొండచిలువ చాలా సేపు ఉక్కిరిబిక్కిరైంది.

కొండచిలువ మేకపిల్లను మింగిన విషయం తెలియటంతో స్ధానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కొండ చిలువ మింగిన మేకను బయటకు కక్కుతున్న దృశ్యాలను వారంతా వింతగా చూశారు.
 
కొండ చిలువ కడుపులో నుండి బయటకు వచ్చిన మేకపిల్ల అప్పటికే చనిపోయింది. అటవీ సిబ్బంది కొండ చిలువను పట్టుకుని సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్ళి వదిలిపెట్టారు. అయితే కొండచిలువ మేకను మింగిన ఘటన ఆప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments