Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి.. డెంగ్యూ జ్వరంతో మృతి

Webdunia
శనివారం, 2 నవంబరు 2019 (11:34 IST)
డెంగ్యూ జ్వరంతో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. చిత్తూరు జిల్లాలో ఈ విషాధం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని నరసింహాపురం పంచాయతీ టీవీఎన్‌ఆర్‌పురంకి చెందిన కృష్ణం రాజు, రెడ్డమ్మల కుమార్తె చంద్రకళ (18)కు ఇటీవలే పెళ్లి కుదిరింది.  అక్టోబర్ 30న పెళ్లి చేసేందుకు వధువు, వరుడు తరుపు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. 
 
అయితే చంద్రకళకు డెంగ్యూ సోకడంతో తమిళనాడులోని షోళింగర్‌ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. పెళ్లిరోజు వరకు ఆమె కోలుకోకపోవడంతో పెళ్లిని కూడా వాయిదా వేశారు. బుధవారం వధువు, వరుడి తరపు వారు ఆస్పత్రికి చేరుకుని.. తొలుత వివాహం జరిపించాలని పట్టుబట్టారు. 
 
కానీ వైద్యులు అందుకు నిరాకరించడంతో ఆస్పత్రి నుంచి వెనుదిరిగారు. శుక్రవారం రాత్రి చంద్రకళ మృతి చెందడంతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. చంద్రకళ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments