Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు: అడవిలో తప్పిపోయిన బాలుడు.. డ్రోన్ల సాయంతో గాలింపు

Webdunia
సోమవారం, 5 జులై 2021 (18:59 IST)
తండ్రి గొర్రెలు మేపడానికి అడవిలోకి వెళ్లగా.. వెనుకే వెళ్లిన మూడేళ్ల బాలుడు తప్పిపోయాడు. అడవిలో తప్పిపోయిన బాలుడి కోసం వరుసగా ఐదవ రోజు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గత రెండు రోజులు డ్రోన్ల సహాయంతో పోలీసులు, అధికారులు బాలుడి కోసం గాలిస్తున్నారు. మంగళవారం పోలీసు జాగిలాలని రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
 
అటు కిడ్నాప్‌ కోణంలోనూ పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈనెల 1న కలువాయి మండలం ఉయ్యాలపల్లిలో సంజు(3) అనే బాలుడు తప్పిపోయాడు.  తండ్రి గొర్రెలు మేపడానికి వెళ్లగా బాలుడు సంజు వెనకే వెళ్లి తప్పిపోయాడు.
 
ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లిలోని అరుంధతి వాడకు చెందిన దండు బుజ్జయ్య, వరలక్ష్మీ దంపతులకు ఇద్దరు సంతానం. బుజ్జయ్య గొర్రెలు కాస్తుండగా.. వరలక్ష్మీ కూలీ పనులు చేసేది. జూలై 1న బుజ్జయ్య గొర్రెలను మేపడం కోసం సమీపంలోని వెలుగొండ అడవిలోకి వెళ్లాడు. మాములుగా రోజు తండ్రి వెనుక వెళ్లే సంజూ.. కొద్ది దూరం వెళ్లాక వెనక్కి వచ్చేవాడు. 
 
కానీ ఐదు రోజుల క్రితం తండ్రి వెనుక వెళ్లిన సంజూ తిరిగి రాకపోవడంతో పోలీసులకు తల్లిదండ్రులు సమాచారం అందించారు. రెండు రోజులపాటు డ్రోన్ల సాయంతో వెతికినప్పటికీ.. బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో జాగిలాలను రప్పించడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments