Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అనే నేను... 30న ఒక్కడినే ప్రమాణం చేస్తా...

Webdunia
ఆదివారం, 26 మే 2019 (15:53 IST)
ఈ నెల 30వ తేదీన తాను ఒక్కడినే ప్రమాణ స్వీకారం చేస్తారని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఆ తర్వాత తన మంత్రివర్గాన్ని విస్తరిస్తానని చెప్పారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ప్రత్యేక హోదాకు కేసీఆర్‌ మద్దతు ఇచ్చారని తెలిపారు. 
 
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాను కూడా మర్యాదపూర్వకంగా కలిసినట్టు చెప్పారు. ప్రజలకు చెప్పినవన్నీ అమలు చేస్తామన్నారు. తమ ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుందన్నారు. అవినీతిరహిత పాలన అందిస్తాం. అవినీతి జరిగిందని తెలిస్తే కాంట్రాక్టులు రద్దు చేస్తామని తెలిపారు. 
 
తన తండ్రి వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఒక్క రోజు కూడా సచివాలయానికి వెళ్లలేదన్నారు. అందుకే ప్రజలు బంపర్ మెజార్టీని కట్టబెట్టారన్నారు. తన తండ్రి చనిపోయిన తర్వాత తనపై కేసులు పెట్టారని గుర్తుచేశారు. పోలవరంలో కుంభకోణం జరిగితే విచారణ చేపడుతామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments