Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలతో ఉన్న వృద్ధురాలిని పీక్కుతిన్న వీధి కుక్కలు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (17:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఒళ్లు జలదరించే ఘటన ఒకటి జరిగింది. ప్రాణాలతో ఉన్న ఓ వృద్ధురాలిని వీధి కుక్కలు సజీవంగా పీక్కుతిన్నాయి. ఈ విషాదకర ఘటన శ్రీకాకుళం జిల్లాలోని శ్రీహరిపురం గ్రామంలో జరిగింది. 
 
బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన అంపిల్లి రాముడమ్మ అనే 65 యేళ్ళ వృద్ధురాలు మంగళవారం రాత్రి తన ఇంటి గడపలోనే నిద్రించింది. రాత్రి సమయంలో అటుగా వచ్చిన వీధి కుక్కల గుంపు... నిద్రపోతున్న రాముడమ్మపై ఒక్కసారిగా దాడిచేశాయి. నిద్రమత్తులో ఉన్న ఆమె.. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు.. కుక్కలన్నీ కలిసి ఆమెను వీధిలోకి ఈడ్చుకొచ్చాయి. 
 
ఆ తర్వాత కుక్కలన్నీ కలిసి ఆమె శరీరాన్ని పీక్కుతిన్నాయి. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. వీధి కుక్కల స్వైరవిహారంతో గ్రామ ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments