Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో దళారీలు జాగ్రత్త.. శీఘ్ర దర్శన టికెట్లని అలా మోసం చేశారు

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (15:18 IST)
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో దళారీలు భక్తులను మోసం చేస్తున్నారు. ఉచిత సర్వదర్శన టోకెన్లను దళారీలు రూ.300ల శీఘ్ర దర్శన టికెట్లుగా భక్తులకు అంటగట్టారు. 
 
వివరాల్లోకి వెళితే..  మార్చి 30న గుంతకల్ కు చెందిన కొందరు భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్నారు. అయితే సర్వదర్శనంలో దర్శనం ఆలస్యం అవుతుందని భావించిన భక్తులు.. శీఘ్ర దర్శన టోకెన్ల కోసం స్థానిక దళారీని ఆశ్రయించారు. 
 
ఈక్రమంలో దళారి కిరణ్ కుమార్ వారికి ఉచిత సర్వదర్శన టోకెన్లు ఇప్పించి..అవి రూ.300 విలువ చేసే శీఘ్ర దర్శన టోకెన్లుగా నమ్మించాడు. అంతే కాదు ఈ టోకెన్లతో ప్రత్యేక ప్రవేశద్వారం దర్శనం కల్పిస్తున్నామంటూ అదనంగా మరో రూ.200 భక్తుల నుంచి నొక్కేసాడు కిరణ్ కుమార్. 
 
ఇక శీఘ్ర దర్శన టోకెన్లు తీసుకున్న భక్తులు క్యూ కాంప్లెక్స్ లో రూ.300 ప్రవేశ ద్వారా వెళ్తుండగా..సిబ్బంది అవి సర్వదర్శన టోకెన్లు అంటూ వారించారు. దీంతో మోసపోయామని గ్రహించిన భక్తులు అక్కడే టీటీడీ విజిలెన్సు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు రంగంలోకి దిగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటనపై టీటీడీ అధికారుల నుంచి ఫిర్యాదు అందుకున్న తిరుపతి టూ టౌన్ పోలీసులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments