Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆజాదీకీ అమృత్ మ‌హోత్స‌వ్ ... శ్రీకాకుళంలో ఫిట్ ఇండియా ర‌న్

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (10:08 IST)
ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో భాగంగా దేశవ్యాప్తంగా జరువుతున్న ఫిట్ ఇండియా రన్ శనివారం ఉదయం శ్రీకాకుళంలో నిర్వ‌హించారు. నెహ్రు యువక కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రన్ ను విశ్రాంత జాయింట్ కలెక్టర్ పి.రజనీ కాంతారావు జెండా ఊపి ప్రారంభించారు.
 
అనంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాద్ కా అమృత మహోత్సవంలో భాగంగా ఆగస్ట్ 13 న ప్రారంభమైన ఈ రన్ అక్టోబర్ 2 వరకు గాంధీ జయంతి వరకు సాగుతుందని, అన్ని జిల్లాల్లో ఈ రన్ నిర్వహిస్తారని అన్నారు. 
 
దృఢమైన భారత్ స్థాపన ప్రధానమంత్రి లక్ష్యమని, ఈ దిశగా అందరూ అడుగులు వేసి ప్రతి నిత్యం వ్యాయామాలు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని  ఆయన కోరారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అరసవల్లి జంక్షన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు 5 కిలోమీటర్లు ఈ రన్ సాగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా  నెహ్రూ యువక కేంద్రం కో ఆర్డినేటర్ మహేశ్వరరావు, జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి బి.శ్రీనివాస్ కుమార్, పలువురు జిల్లా అధికారులు, ఎన్. సి.సి.విద్యార్థులు, వాకర్స్ వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, ఇండియన్ రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments