Webdunia - Bharat's app for daily news and videos

Install App

'హెచ్.జె.టి-36' యుద్ధ విమానాన్ని నడిపిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

ఠాగూర్
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (17:12 IST)
కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కె.రామ్మోహన్ నాయుడు యుద్ధ విమానాన్ని నడిపారు. ఏరో ఇండియా 2025లో భాగంగా యుద్ధ విమానాన్ని ఆయన నడిపారు. యుద్ధ విమానాన్ని నడపడం మరిచిపోలేని అనుభూతి అంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. హెచ్.జె.టి-36 యశస్ అనే అద్భుతమై జెట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోడం ఆనందంగా ఉంది. 
 
సంజయ్ దత్‌కు రూ.72 కోట్ల ఆస్తి రాసిచ్చిన మహిళా వీరాభిమాని!! 
 
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు ఓ మహిళా వీరాభిమాని రూ.72 కోట్ల విలువ చేసే ఆస్తిని రాసిచ్చింది. ఆ మహిళా వీరాభిమాని పేరు నిషా పాటిల్ (62). ఇటీవలే ఆమె చనిపోయారు. 2018లోనే సంజయ్ దత్ పేరిట వీలునామా రాయించింది. అయితే, ఆ ఆస్తిని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆస్తిని స్వీకరించేందుకు నిరాకరించారు. అయితే, ఆ అభిమాని ప్రేమకు ఈ ఖల్‌ నాయక్ చలించిపోయాడు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబైకి చెందిన నిషా పాటిల్‌కు బావీవుడ్ హీరో సంజయ్ దత్ విపరీతమైన అభిమానం. తొలి నుంచి కూడా ఆయనను అభిమానిస్తుంది. ఆయన ప్రతి సినిమాను లెక్కలేనన్ని సార్లు చూసింది. ఇటీవలే ఆమె కన్నుమూసింది. ఆమె వయసు 62 యేళ్లు. కాగా, ఆమె పేరిట దాదాపు రూ.72 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. 
 
తనకు చివరి రోజులు దగ్గర పడుతున్నాయని విషయాన్ని గ్రహించిన నిషా పటేల్.. 2018లోనే తన ఆస్తి, బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బు సంజయ్ దత్‌కు చెందేలా వీలునామా రాయించింది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె వీలునామా దస్తావేజులు సంజయ్ దత్‌ ఇంటికి వచ్చారు. విషయం తెలిసిన సంజయ్ దత్‌ షాక్ గురయ్యారు. పరిచయం లేని వ్యక్తి ఆస్తి రాసివ్వడం చూసి చలించిపోయారు. 
 
అయితే, ఆ ఆస్తిని సంజయ్ దత్ తీసుకోలేదు. ఆ ఆస్తి తిరిగి ఆమె కుటుంబానికి చెందేలా చూడాలని తన లీగల్ టీమ్‌కు సూచించారు. ఇంత గొప్ప అభిమానిని కలవలేకపోవడం బాధగా ఉందని చెప్పారు. కనీసం ఆమె కుటుంబ సభ్యులైనా కలిసి కొంత ఊరట చెందుతానని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments