Webdunia - Bharat's app for daily news and videos

Install App

సవతి తల్లితో అక్రమ సంబంధం.. ఆపై అనుమానంతో?

మానవ సంబంధాలను మంటగలిపేశారు. స్వయానా సవతి తల్లితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆపై ఆమెను అనుమానించి హత్య చేసిన సంఘటన నెల్లూరు జిల్లా గడప మండలం అడవిపూడిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.... అడవిపూడి గ్రామానికి చెందిన సత్యనారాయణకు భానుమతికి వివాహమైంది. వీరికి

Webdunia
గురువారం, 3 మే 2018 (13:54 IST)
మానవ సంబంధాలను మంటగలిపేశారు. స్వయానా సవతి తల్లితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆపై ఆమెను అనుమానించి హత్య చేసిన సంఘటన నెల్లూరు జిల్లా గడప మండలం అడవిపూడిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.... అడవిపూడి గ్రామానికి చెందిన సత్యనారాయణకు భానుమతికి వివాహమైంది. వీరికి ఐదుగురు సంతానం. అనారోగ్యంతో భానుమతి చనిపోయింది. దీంతో సత్యానారాయణ రాజేశ్వరి అనే మరో మహిళను రెండవ పెళ్ళి చేసుకున్నాడు. ఈమెకు ముగ్గురు సంతానం.
 
రాజేశ్వరి విజయవాడలోని ఒక ఆశ్రమంలో పనిచేస్తోంది. వారానికి మూడురోజులు అక్కడే పనిచేసి వస్తుంది. అయితే సత్యనారాయణ కొడుకుల్లో రెండో వ్యక్తి కుమార్ రాజ పిన్నితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆరు నెలల పాటు వీరి మధ్య ఆ సంబంధం కొనసాగింది. ఐతే విజయవాడకు వెళ్ళి వస్తున్న రాజేశ్వరిపై కుమార్ రాజ అనుమానం పెట్టుకున్నాడు. విజయవాడలో మరొక వ్యక్తితో రాజేశ్వరి కలుస్తోందన్న అనుమానం పెట్టుకున్న కుమార్ రాజ పక్కా ప్లాన్ వేశాడు. 
 
పిన్నిని ఎలాగైనా చంపాలని, ఆమెకు పూటుగా మద్యం తాగించేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసి ఆపై బండరాయితో కొట్టి చంపేశాడు. ఆనవాళ్లు కనబడకుండా అక్కడే రాజేశ్వరిని పూడ్చేశాడు. అంతటితో ఆగలేదు పోలీస్ స్టేషనుకు వెళ్లి తన పిన్ని కనబడటం లేదంటూ ఫిర్యాదు కూడా ఇచ్చాడు. పోలీసులు రెండుమూడురోజులు వెతికి చివరకు అనుమానం వచ్చి కుటుంబ సభ్యులందరినీ విచారించారు. దీంతో కుమార్ రాజ బాగోతం బయటపడింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments