Webdunia - Bharat's app for daily news and videos

Install App

25న ఢిల్లీలో ఏపీ విభజన అంశాలపై కీలక భేటీ

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (20:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాల పరిష్కారం కోసం గురువారం ఢిల్లీలో కీలక భేటీ జరుగనుంది. ఇందుకోసం ఏపీ ప్రతినిధి బృందంతో కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి సోమనాథన్ భేటీకానున్నారు. ఈ భేటీకి ఏపీ ప్రభుత్వం తరపున ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు హాజరుకానున్నారు. 
 
కాగా, ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర విభజన సమస్యలపై ప్రధానికి ఏకరవు పెట్టారు. ఏపీ విభజన చట్టంలోని హామీల అమలు, పోలవరం సవరించిన అంచనాలు, రాష్ట్ర లోటు బడ్జెట్‌ను భర్తీ చేసే అంశం తదితర అంశాలపై ప్రధానికి సీఎం జగన్ ఓ వినతి పత్రం కూడా అందజేశారు. 
 
సీఎం జగన్ విన్నపంపై స్పందించిన ప్రధాని మోడీ ఏపీ విభజన సమస్యల పరిష్కార బాధ్యతను ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్‌కు అప్పగించారు. దీంతో ఆయన గురువారం ఏపీ ప్రతినిధి బృందంతో ప్రత్యేకంగా భేటీకానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments