Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలాపురం అల్లర్లు : కీలక నిందితుడు అన్యం సాయి అరెస్టు

Webdunia
బుధవారం, 25 మే 2022 (19:20 IST)
కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో జరిగిన హింసాత్మక ఘటనలో కీలక నిందితుడుగా భావిస్తున్న అన్యం సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద అల్లర్లకు దారితీసిన పరిస్థితులపై విచారిస్తున్నారు. 
 
కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఏపీ ప్రభుత్వం పేరు మార్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు, అంబేద్కర్ పేరు కొనసాగించాలని మరికొందరు పోటాపోటీగా ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగి అల్లర్లకు దారితీశాయి. రాష్ట్ర మంత్రి విశ్వరూపం, ఎమ్మెల్యే సతీష్ గృహాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. 
 
ఈ అల్లర్లకు కారణమైన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వీరిలో అన్యం సాయి ప్రధాన నిందితుడుగా భావిస్తున్నారు. ఈయన అధికార వైకాపాకు చెందిన నేతలగా భావిస్తున్నారు. 
 
జిల్లా పేరును మారిస్తే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని చొక్కా విప్పేసి కిరోసిన్ క్యాన్ చేతబట్టిన సాయి వీడియోలు ప్రస్తుతం న్యూస్ చానెళ్ళలో వైరల్‌గా మారాయి. ఆరంభం నుంచి జిల్లా పేరును మార్చొద్దంటూ సాగుతున్న ఆందోళనలో సాయి కీలకంగా వ్యవహిరిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments