Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీర జవాన్ జశ్వంత్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు

Webdunia
శనివారం, 10 జులై 2021 (14:01 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు అశృనయనాల మధ్య శనివారం జరిగాయి. ఈ వేడుకలను పూర్తిగా సైనిక లాంఛనాలతో నిర్వహించారు. జశ్వంత్ తండ్రి శ్రీనివాస్ రెడ్డి మృతదేహానికి చితి అంటించారు. 
 
ఈ సందర్భంగా గౌరవ సూచకంగా సైనికులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. జశ్వంత్‌రెడ్డి భౌతికకాయానికి హోంమంత్రి సుచరిత, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, కలెక్టర్‌, ఎస్పీ నివాళులర్పించారు. అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. 
 
జశ్వంత్ అమర్ రహే అంటూ ఆ ప్రాంతం నినాదాలతో మారుమోగింది. ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన రూ.50 లక్షల సాయాన్ని జవాన్ జశ్వంత్ రెడ్డి కుటుంబసభ్యులకు హోంమంత్రి సుచరిత అందించారు.
 
కాగా, కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా సుందర్ బనీ సెక్టారులో గురువారం(జున్ 8) అర్ధరాత్రి సెన్యానికి, ఉగ్రవాదులు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాదకొత్తపాలెంకు చెందిన తెలుగు జవాను జశ్వంత్ రెడ్డి అమరుడయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments