Webdunia - Bharat's app for daily news and videos

Install App

మింగడానికి మెతుకు లేదుగానీ... 33 రాజధానులా?

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (16:09 IST)
నవ్యాంధ్ర రాజధాని తరలింపు అంశంపై రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, రాజధానిని మరో ప్రాంతానికి తరలించడానికి వీల్లేదని వారు డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తారు. ఈనేపథ్యంలో తుళ్లూరులో రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నారు. వీరికి టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మద్దతు తెలిపారు. 
 
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, 'మింగడానికి మెతుకు లేదుగానీ.. 33 రాజధానులు నిర్మిస్తారా...? నిజంగా అంత ధైర్యముంటే అమరావతి నిర్మాణం పూర్తి చేశాక.. ఎన్ని రాజధానులు నిర్మిస్తావో నిర్మించు' అంటూ సవాల్ విసిరారు. 
 
నాడు అమరావతికి అంగీకరించిన జగన్‌.. ఇవాళ ఎందుకు ప్లేటు మార్చారంటూ నిలదీశారు. రాజధాని మార్పు సీఎం సొంత సమస్య కాదని.. 5 కోట్ల మంది ప్రజలదని, రైతుల పోరాటానికి అండగా ఉంటామని గొట్టిపాటి రామకృష్ణ అన్నారు.
 
అలాగే, బీజేపీ నేత గోపీనాథ్ దాస్ స్పందిస్తూ, రాష్ట్రంలో రావణరాజ్యం నడుస్తోందని.. ప్రజల కష్టాలు చూస్తూ సీఎం జగన్‌ రాక్షస ఆనందం పొందుతున్నారంటూ మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments