Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు అమిత్ షా ఫోన్... ఢిల్లీకి రమంటూ ఆహ్వానం

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేశారు. ఢిల్లీకి వస్తే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చని సూచించారు. దీనికి చంద్రబాబు ససేమిరా అన్నారు.

Webdunia
శనివారం, 3 మార్చి 2018 (08:49 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేశారు. ఢిల్లీకి వస్తే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చని సూచించారు. దీనికి చంద్రబాబు ససేమిరా అన్నారు. అవసరమైతే ముగ్గురు సభ్యుల బృందాన్ని హస్తినకు పంపిస్తామని చెప్పారు. దీంతో షా ఫోన్ పెట్టేసినట్టు సమాచారం. 
 
సోమవారం నుంచి బడ్జెట్ మలిదశ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈనేపథ్యంలో ఏపీకి సాయం అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసిన పక్షంలో రాజీనామాలకు సిద్ధమని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారు. దీంతో ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ కూడా దూరమవుతుందన్న బీజేపీ భావిస్తోంది. 
 
ఈనేపథ్యంలో చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేసి, చర్చిద్దాం రమ్మని ఆహ్వానం పలికారు. ఐదో తేదీన ఢిల్లీకి వస్తే కలిసి మాట్లాడుకుందామని సూచించారు. చర్చలకు సమ్మతించిన చంద్రబాబునాయుడు తాను రానని స్పష్టంగా తేల్చిచెప్పారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావులను పంపిస్తానని, వారితో మాట్లాడాలని ఆయన తెలిపారు. దీంతో షా ఖంగుతిని ఫోన్ పెట్టేశారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments