Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంజనేయ స్వామి సాక్షిగా అమ్మాయిపై బ్లేడుతో దాడి

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (14:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లిలో దారుణం జరిగింది. ఈ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా వి.మాడుగులలో ఓ ఉన్మాది ఒక యువతిని బ్లేడుతో గొంతు కోశారు. ఈ ఘటన స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వి.మాడుగుల గ్రామానికి చెందిన నగేశ్ అనే ఉన్మాది ఓ యువతి వెంటబడి ప్రేమిస్తున్నాంటూ వేధించసాగాడు. అయితే, ఆ యువతి నగేశ్ ప్రేమను తిరస్కరించింది. దీంతో కక్ష పెంచుకున్న నగేశ్ ఆ యువతి తనకు దక్కకుంటే మరెవ్వరికీ దక్కకూడదన్న ప్రతీకారంతో రగిలిపోయాడు. 
 
ఈ క్రమంలో సోమవారం ఉదయం స్థానికంగా ఉండే ఆంజనేయ స్వామి గుడికి వెళ్లిన ఆ యువతిని అనుసరించిన ఉన్మాది నగేశ్... అప్పటికే పక్కా ప్రణాళికతో తన వద్ద ఉన్న బ్లేడుతో ఆ యువతిపై దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని గమనించిన స్థానికులు బాధిత యువతిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
గతంలో కూడా ఈ యువతిపై నగేశ్ ఇదే విధంగా దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి. అయితే, అపుడు పోలీసులు నగేశ్‌కు వార్నింగ్ ఇచ్చి వదిలివేశారు. ఇపుడు ఏకంగా ఆ యువతిపై బ్లేడుతో దాడిచేశాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments