Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరి గోచీ పట్టుకుని డబ్బులు తెస్తున్నారో తెలియదు.. చంద్రబాబుపై జేసీ ప్రశంసలు

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు మేథస్సుకు ప్రతి ఒక్కరూ తలవంచి నమస్కరిం

Webdunia
మంగళవారం, 23 మే 2017 (09:02 IST)
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు మేథస్సుకు ప్రతి ఒక్కరూ తలవంచి నమస్కరించాలంటూ పిలుపునిచ్చారు.
 
అనంతపురంలో జరిగిన మినీ మహానాడులో జేసీ పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి గల నేత అని కితాబిచ్చారు. 'సీఎం ఏం చేస్తున్నారో ఏమో... ఎవరి గోచీ పట్టుకుని డబ్బులు తెస్తున్నారో తెలియదు. హంద్రీనీవాను మూడు నెలల్లో పూర్తి చేస్తానంటున్నారు. అనంతపురం జిల్లాను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. అతని మేథస్సుకు మనమంతా నమస్కారాలు పెట్టుకోవాలి' అని వ్యాఖ్యానించారు.
 
అంతేకాకుండా, అధికారంలో చంద్రబాబు ఉంటేనే కొంచెం తాగునీరు, కొంచెం సాగునీరు వస్తోంది. ఇంకెవ్వడు వచ్చినా అవి దొరకవు. ఆయనా కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. ఆయనేమీ సాయిబాబా కాదు కదా. చంద్రబాబును ఎవరైనా విమర్శిస్తే పాపమొస్తుంది. ఇంకో ఐదేళ్లు అధికారమిస్తే అనుకున్నవన్నీ వస్తాయయ్యా. ఇదే మనం చేయాల్సిన పని' అంటూ టీడీపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments