Webdunia - Bharat's app for daily news and videos

Install App

4 రోజుల్లో పెళ్లి.. వెడ్డింగ్ కార్డులు పంచేందుకు వెళ్లి... వరుడు మృతి

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (12:56 IST)
మరో నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకున్న వరుడు.. పెళ్లికి ఆహ్వాన పత్రికలు పంచేందుకు వెళ్ళి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా కదిరి మండలం ఎరుకలవాండ్లపల్లి సమీపంలో జరిగింది. 
 
ఈ నెల 27వ తేదీన కదిరిలో ఎర్రదొడ్డికి చెందిన మహేష్‌ (26)కు వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి సమయం దగ్గర పడుతుండటంతో బంధువులకు వివాహ పత్రికలను పంచేందుకు స్వగ్రామం నుంచి అర్థరాత్రి బయలుదేరిన మహేష్‌ కొద్ది సమయానికే గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. 
 
ఈ విషయం తెలిసిన కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. ఉపాధి కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లిన మహేష్‌ నెల రోజుల కిందటే పెళ్లి కోసం సొంత ఊరికి వచ్చారని, త్వరలో ఓ ఇంటివాడై కోడలితో కలిసి జంటగా వస్తాడనుకుంటే అందరిని వదిలేసి వెళ్లాడంటూ... కుటుంబీకులు, బంధువులు రోదించారు. దీనిపై స్తానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

సూర్య నటించిన రెట్రో ప్రీరిలీజ్ హైదరాబాద్ లో గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన సారంగపాణి జాతకం చిత్రం రివ్యూ

టామ్ క్రూయిస్ మిషన్: ఇంపాజిబుల్ - భారతదేశంలో 6 రోజుల ముందుగా విడుదల

కలియుగమ్ 2064 ట్రైలర్, మోడరన్ కైండ్ ఆఫ్ బుక్ లా వుంది : రాంగోపాల్ వర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

తర్వాతి కథనం
Show comments