Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అక్రమాస్తుల కేసు : హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు ఏ-1, ఏ-2

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (11:06 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో సాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా, ముఖ్యమంత్రి హాదాలో వైకాపా అధినేత జగన్ తొలిసారి శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన ఏ-1 నిందితుడుగా ఉన్న విషయం తెల్సిందే. దీంతో కేసు విచారణకు ఆయన హాజరయ్యారు. 
 
ఇందుకోసం విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి శుక్రవారం ఉదయం హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో నేరుగా కోర్టుకు వెళ్లారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-2గా ఉన్న వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డితో పాటు.. మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు కూడా కోర్టుకు వచ్చారు. 
 
నిజానికి ఈ కేసు విచారణలో భాగంగా, జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సివుంది. అయితే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలనాపరమైన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందువల్ల వ్యక్తిగత హాజరు నుంచి కొంతకాలం జగన్‌కు మినహాయింపు ఇచ్చింది. అయితే, జనవరి పదో తేదీన జరిగే విచారణకు మాత్రం తప్పకుండా హాజరుకావాల్సిందేనంటూ ఆదేశించింది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకు హాజరైబోనులో నిల్చున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments