మాజీ సీఎం జగన్‌పై మరో కేసు నమోదు

ఠాగూర్
మంగళవారం, 24 జూన్ 2025 (14:08 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. గత ఫిబ్రవరి 19వ తేదీన ఆయన గుంటూరు జిల్లా మిర్చియార్డు పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ, పోలీసుల అనుమతి లేకుండా ఈ పర్యటనకువచ్చారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వైకాపా నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 
 
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్పప్పటికీ వైకాపా నేతలు అనుమతి లేకుండా వచ్చి హడావుడి చేశారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే యార్డులో జగన్ రాజకీయ ప్రసంగాలు చేశారు. ఈ నేపథ్యంలో జగన్‌తో పాటు నేతలు అంబటి రాంబాబు, లేళ్ళ అప్పిరెడ్డి, కావడి మనోహర్ నాయుడు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులపై కేసు నమోదైంది.
 
ఇప్పటికే పోలీసులు వారికి 41ఏ నోటీసులు ఇచ్చారు. పిలిచినపుడు నల్లపాడు ఠాణాకు విచారణకు రావాలని సూచించారు. కాగా, పల్నాడు జిల్లాలోని రెంటపాళ్లలో జగన్ పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా చిలీ సింగయ్య అనే వ్యక్తి జగన్ కారు కింద పడి మృతి చెందాడు. దీనిపై జగన్‌పై ఇప్పటికే కేసు నమోదైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

రివాల్వర్ రీటా పర్ఫెక్ట్ కమర్షియల్ డార్క్ కామెడీ ఫిల్మ్ : కీర్తి సురేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments