Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కారు.. స్కూళ్లలో ఫోన్లు నిషేధం

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (15:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లలో ఫోన్లు నిషేధించింది. విద్యార్థులు పాఠశాలలకు మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, ఉపాధ్యాయులు కూడా తాము వినియోగించే మొబైల్ ఫోన్లను తరగతి గదుల్లోకి తీసుకెళ్ళకూడదని స్పష్టంచేసింది. నిబంధనలు ఉల్లఘించే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. 
 
తరగతి గదుల్లో బోధనకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. నిబంధనలు ఉల్లఘించే ఉపాధ్యాయులు, విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. పైగా, ఈ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా ప్రధానోపాధ్యాయులు, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సూచన చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments