Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ : నిరసనకు దిగిన అడ్వకేట్లు

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (14:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ చేస్తూ సిఫార్సు చేసింది. దీంతో ఏపీ హైకోర్టులో విధులు నిర్వహిస్తూ వచ్చిన బట్టు దేవానంద్, డి.రమేష్‌లు బదిలీ అయ్యారు. వీరిలో బట్టు దేవానంద్ మద్రాసు హైకోర్టు బదిలీ కాదా, జస్టిస్ డి.రమేష్ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది. 
 
అయితే, న్యాయమూర్తుల బదిలీలను నిరసిస్తూ హైకోర్టుకు చెందిన న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తూ విధులను బహిష్కరించారు. ఉత్తరాది, దక్షిణాది న్యాయమూర్తుల పట్ల సుప్రీంకోర్టు కొలీజియం వివక్ష చూపుతోందని వారు ఆరోపిస్తున్నారు. 
 
దేశంలోని వివిధ హైకోర్టుల నుంచి ఏడుగురు న్యాయమూర్తులను కొలీజియం బదిలీ చేస్తూ గురువారం సిఫార్సు చేసింది. వీరిలో ఏపీ హైకోర్టు, మద్రాస్ హైకోర్టులో ఇద్దరేసి, తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు ఉన్నారు. 
 
జస్టిస్ దేవానంద్ మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ రమేష్ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సారథ్యంలోని కొలీజియం సిఫార్సు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments