Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశం జిల్లాలో మూడు సెకన్ల పాటు కంపించిన భూమి

Webdunia
ఆదివారం, 7 మే 2023 (15:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ఈ ప్రకంపనలను పసిగట్టిన ప్రజలు భయంతో తమ ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూప్రకంపనలకు ముందు భారీ శబ్దం వినిపించినట్టు స్థానికులు వెల్లడించారు. 
 
ఆదివారం ఉదయం జిల్లాలోని ముండ్లమూరు గ్రామంలో ఈ భూప్రకంపనలు కనిపించాయి. రెండు మూడు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై గ్రామస్థులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూమి కంపించడానికి ముందు భారీ శబ్దం వినిపించిందని చెప్పారు. ఆ తర్వాత కాసేపటికే భూమి కంపించడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చామని వారు వివరించారు. ఈ ఘటనతో గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. 
 
కాగా, ఇటీవలికాలంలో తెలుగు రాష్ట్రాల్లో వరుసగా భూ ప్రకంపనలు చోటుచేసుకుంటున్న విషయం తెల్సిందే. ఈ యేడాది మార్చి నెలలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాతసలో భూమి కంపించింది. దీంతో గ్రామంలోని పలు గృహాల గోడలకు బీటలు వారాయి. వీధుల్లో వేసిన సిమెంట్ రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా, పులిచింతల ప్రాజెక్టు ప్రాంతంలో తరచుగా ఈ భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments