Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుత్తిలో ఈవీఎంను నేలకేసి కొడితే? పవన్ కల్యాణ్ (Video)

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (11:41 IST)
ఏపీలో ఈవీఎంలు మొరాయించాయని ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా బాబు బాటలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఈవీఎంలు పనిచేయట్లేదని ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 10 శాతానికి పైగా ఈవీఎంలు పనిచేయడం లేదన్నారు.


అవి ఎందుకు పనిచేయడం లేదో తమకు తెలియడం లేదని వ్యాఖ్యానించారు. ఓ పార్టీకి ఓటు వేస్తే మరో పార్టీకి పడుతున్నట్లు తమకు రిపోర్టులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సమస్యలన్నింటిని వెంటనే పరిష్కరించాలని ఎలక్షన్ కమిషన్, కమిషనర్‌ను కోరారు.
 
మరోవైపు అనంతపురం జిల్లా గుత్తిలో ఏర్పాటుచేసిన ఈవీఎంను గురువారం జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా నేలకేసి కొట్టిన సంగతి తెలిసిందే. పోలింగ్ కంపార్ట్ మెంట్‌లో నియోజకవర్గం పేరును సరిగ్గా రాయలేదని ఆగ్రహం వ్యక్తంచేసిన గుప్తా, పోలింగ్ కేంద్రంలో ఇతర పార్టీల ఏజెంట్లతో గొడవ పడ్డారు. ఈ సందర్భంగా ఈవీఎంను నేలకేసి కొట్టడంతో అది పనిచేయకుండా పోయింది. 
 
దీంతో పోలింగ్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా విజయవాడలో పవన్ కల్యాణ్ ఓటు హక్కును వినియోగించుకున్న నేపథ్యంలో మీడియా ఈ వ్యవహారంపై ఆయన్ను ప్రశ్నించింది.
 
దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్ గుత్తిలోని బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 183వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన జరిగినట్లు తాను మీడియాలో చూశానని తెలిపారు. వాస్తవాలేంటో తెలుసుకుని మాట్లాడుతానని పవన్ చెప్పారు. చూడండి ఆయన మాటల్లోనే...
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments