Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఏపీ కొత్త మంత్రివర్గ తొలి సమావేశం... దిశచట్టం సవరణపై చర్చ

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (13:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్తమంత్రివర్గం తొలి సమావేశం శుక్రవారం జరుగనుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరుగనుంది. ఇటీవల ఏపీ మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత కొత్త మంత్రివర్గం ఒక్కసారి కూడా సమావేశంకాలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరుగనుంది. ఈ భేటీ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 
 
ఈ మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా దేవాదాయ శాఖలో రెండు లక్షల ఎకరాలు భూములు అర్చకుల ఆక్రమణలో ఉన్నట్టు గుర్తించారు. ఈ భూములపై ప్రధానంగా చర్చ జరుగనుంది. 
 
అలాగే, దిశ చట్టం సవరణలకు సంబంధించిన అంశాన్ని కూడా మంత్రివర్గంలో మరోమారు నిర్ణయం తీసుకుని కేంద్రానికి పంపే అవకాశాలు ఉన్నాయి. అలాగే, ఇటీవల కోనసీమ జిల్లా పేరు మార్పుపై చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులతో పాటు ఆ జిల్లా మార్పుపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. 
 
అలాగే, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైకాపా ఎంపీలు మద్దతు ఇచ్చే విషయంపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. ఇప్పటికే భేషరతు మద్దతు ప్రకటించిన వైకాపా.. ఆమె నామినేషన్ దాఖలు సమయంలోనూ వైకాపా ఎంపీలు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments