Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై బదిలీ వేటు

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (18:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై బదిలీ వేటు వేసింది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సీఐడీ చీఫ్‌గా కొనసాగుతున్న సునీల్ కుమార్.. వైకాపా రెబెల్ ఎంపీ రఘురామరాజును పోలీసులతో కొట్టించడంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు వచ్చాయి. అలాగే, పలువురు టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు కూడా చేశారు. 
 
ఇలా, సునీల్ కుమార్‌పై అనేక రకాలైన ఆరోపణలు వచ్చినప్పటికీ వైకాపా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ క్రమంలో సీఐడీ విభాగంలో అదనపు డీజీ హోదాను కల్పించింది. ఇపుడు ఆయన్ను బదిలీ చేస్తూ, సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ)లో రిపోర్టు చేయాలంటూ ఆదేశించింది. అదేసమయంలో సునీల్ కుమార్ స్థానంలో సీఐడీ అదనపు డీజీగా అగ్నిమాపక శాఖ డీజీ సంజయ్‌కు అదనపు బాధ్యతలను అప్పగించింది. 
 
వైకాపా అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల కాలంలో సీఐడీ పేరు, సునీల్ కుమార్ పేర్లు ఎక్కువగా వినిపించాయి. ఈ క్రమంలో ఆయన్ను బదిలీ చేయడం అదికూడా సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్టు చేయాలని ఆదేశించడం ఇపుడు రాష్ట్ర వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments