Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో పర్యటించనున్న ఏపీ సీఎం జగన్: ప్రధానితో భేటీ

Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2022 (17:17 IST)
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీతో భేటీకానున్నారు.
 
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం. అనంత‌రం రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌డ్ ల‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లువ‌నున్నారని స‌మాచారం.
 
ఢిల్లీ పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఆదివారం సాయంత్రం 6.30 గంట‌ల‌కు తాడేప‌ల్లి నుంచి బ‌య‌లుదేర‌నున్నారు. రాత్రి 9.15 గంట‌లకు ఢిల్లీ చేరుకుని జ‌న్ ప‌థ్ నివాసంలో బ‌స చేయనున్నారు.

సోమ‌వారం ఉద‌యం ప్రధాని మోదీతో ఆయ‌న భేటీకానున్నారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశంపై ప్రధాని మోదీకి వినతిపత్రం సమర్పించనున్నారు.
 
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం వెచ్చించిన రూ. 2,900 కోట్ల నిధులను విడుదల చేయాలని ప్రధానిని జగన్‌ కోరనున్నారు.

అలాగే ముంపు మండలాల్లో జనం పునరావాసానికి నిధులివ్వాల్సిందిగా ప్రధానికి వినతిపత్రం సమర్పిస్తారు. సవరించిన అంచనాల ప్రకారం రూ. 55వేల 548.87 కోట్ల విడుదలకు అనుమతివ్వాల్సిందిగా సీఎం జగన్‌ కోరనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments